- Advertisement -
తెలంగాణ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ పేరిట ఫోర్జరీ సంతకాలు బయటపడడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సీరియస్ అయ్యారు. మంత్రి సంతకాలను ఫోర్జరీ చేసారంటూ వరుసగా పత్రికల్లో కథనాలు వచ్చాయి.
దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్ విచారణకు అదేశించారు. ఆయన ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి మంత్రి పేషీలో ఒకరిని, ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి పేషిలో మరొకరిని విచారించినట్లు సమాచారం. కీలకమైన ఫైళ్లు, కొన్ని లేఖలపై మంత్రి సంతకాలను పరీక్షిస్తున్నారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో చర్యలు తీసుకోవచ్చునని భావిస్తున్నారు.