ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు విశాఖ పట్టణం చేరుకొన్నారు. కాసేపట్లో శారద పీఠానికి వెళ్లి.. స్వరూపానందదేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. జగన్ ఏపని చేయాలన్న శారదాపీఠ ఆశీసులు తీసుకొనె మొదలు పెట్టడం జరిగింది. .వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు స్వరూపానంద ఆశీస్సులు తీసుకొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన తొలిసారిగా స్వరూపనందేంద్ర ఆశీస్సుల కోసం వచ్చారు.
ఈ నెల 8వ తేదీన జగన్ తన మంత్రివర్గాన్ని కూడ విస్తరించనున్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ముహుర్తం గురించి కూడ జగన్ స్వరూపానందతో చర్చించే అవకాశం ఉంది.సీఎం వైఎస్ జగన్ రానుండటంతో ఏ.డీ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో అభిమానులు భారీగా ఆయన స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం హోదాలో వైఎస్ జగన్ తొలిసారి విశాఖ వస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్టులో అదనపు భద్రతా చర్యలు చేపట్టారు.