ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎట్టకేలకు రాహుల్ పట్టాభిషేకం ముహూర్తం కరారయ్యింది. న్యూఢిల్లీలో సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష పదవికి రాహుల్ ఎన్నిక ఏకగ్రీవమవుతుందని, ఆయన పట్టాభిషేకం వెంటనే జరిగిపోతుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్న వేళ, తదుపరి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది.
డిసెంబర్ 16న ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికలు నిర్వహించేందుకు సోమవారం ఉదయం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ అధ్యక్ష పదవికి డిసెంబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. డిసెంబర్ 4 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. డిసెంబర్ 16న ఓటింగ్ జరుగుతుంది. 19న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రెండో నామినేషన్ దాఖలు కాకపోతే డిసెంబర్ 4నే రాహుల్ను అధ్యక్షుడిగా ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే రాహుల్ను పగ్గాలు అప్పగించాలంటూ సీడబ్ల్యూసీ భేటీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది.