- Advertisement -
బ్యాంకులకు టోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాను భారత్ కు రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ మేరకు ఇంటర్ పోల్ కు భారత ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. మాల్యాను భారత్ కు పంపేందుకు బ్రిటన్ నిరాకరించడంతో భారత ఇడి అధికారులు తమ చర్యలను వేగవంతం చేశారు.
రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన వ్యక్తి ఏ దేశంలో ఉన్నా ఆ దేశం అతడిని అరెస్టు చేసి స్వదేశానికి అప్పగించాల్సి ఉంటుంది. మాల్యాను భారత్ కు రప్పించేందుకు అన్ని అవకాశాలు మూసుకుపోవడంతో ఈడి అధికారులు చివరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరో నాలుగైదు రోజుల్లో విజయ్ మాల్యా భారత్ కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.