Thursday, May 9, 2024
- Advertisement -

వాట‌ర్ హీట‌ర్‌కు నాలుగేళ్ల చిన్నారి బ‌లి…

- Advertisement -

తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలను బలిగొంది. హీటర్‌తో నీరు వేడి చేస్తుండగా అందులో చేతులు పెట్టిన చిన్నారి విద్యుదాఘాతంతో మృత్యువాత పడింది. ఈ ఘటన విశాఖ జిల్లా కశింకోట మండలంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లో కి వెల్తే….పరవాడపాలెంకు చెందిన పడమటయ్య, నాగరత్నం భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల గాయిత్రి అనే కూతురు ఉంది. పడమటయ్య ఇనుప గమేళాలు తయారు చేసి జీవనోపాధి పొందుతున్నాడు.

పెళ్లయిన చాలా ఏళ్ల వరకు ఈ దంపతులకు పిల్లల్లేరు. పిల్లల కోసం గుడులు గోపురాలు తిరిగారు. నోములు వ్రతాలు చేశారు. వారి పూజలు ఫలించి నాలుగేళ్ల క్రితం ఆడపిల్ల పుట్ట్టడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. గాయత్రి అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.

ఉదయం చిన్నారిని అంగన్‌వాడీ స్కూలుకు పంపేందుకు రెడీ చేస్తున్నారు. దీంతో స్నానం చేయించేందుకు వేడినీళ్ల కోసం బకెట్‌లో వాటర్ హీటర్ పెట్టారు. తల్లిదండ్రులు వేరే పనుల్లో బిజీ అయిపోయారు. అయితే ఆడుకుంటూ వెళ్లి గాయిత్రీ హీటర్‌పై కాలు వేసింది. ఆ టైంలో తల్లిదండ్రులు ఎవరూ గాయిత్రిని గుర్తించకపోవడంతో అపస్మారక స్థితికి చేరుకుంది.

తర్వాత వచ్చి చూసే సరికి గాయిత్రి పరిస్థితి విషమంగా మారపోయింది. వెంటనే హీటర్ స్వీచ్ ఆఫ్ చేసి .. గాయిత్రిని కశింకోట ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తర్వాత అనకాలపల్లి ప్రాంతీయ ఆస్సత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే చిన్నారి మృతిచెందిందని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో త‌ల్లి దండ్రులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -