విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయాలని చూస్తే మరో ఉద్యమం తప్పదని టిడిపి అధినేత చంద్రబాబు హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల శాశ్వత హక్కు అని ఉద్ఘాటించారు. అమరావతి వాసి అమృతరావు దీక్షతో కర్మాగారం సాధించుకున్నామని గుర్తు చేశారు. లక్షలమంది ఉద్యమిస్తే ఉక్కు కర్మాగారం సాధ్యమైందని అన్నారు. లక్షల కోట్లు కొట్టేదామనుకున్న జగన్ గ్యాంగ్ కుతంత్రాన్ని అడ్డుకుని తీరుతామని వ్యాఖ్యానించారు.
మంత్రివర్గం నుంచి పెద్దిరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని.. వర్ల రామయ్య అన్నారు. రాజ్భవన్లో గవర్నర్ కార్యదర్శిని కలిసి.. ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి రహస్య పరిపాలన చేస్తున్నారని వర్ల ఆరోపించారు.
ఓ పార్టీకి కొమ్ముకాసేలా నిమ్మగడ్డ చర్యలు..!
అల్లు అర్జున్ క్యారీ వ్యాన్ ఢీకొట్టిన లారీ.. తప్పిన పెను ప్రమాదం