బాలికలు ఒంటరిగా కన్పిస్తే వారిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి రేప్ చేసి హత్యలు చేసే మానవ మృగాన్ని ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లో రెండేళ్లుగా అభం శుభమెరుగని చిన్నారులపై అకృత్యాలకు పాల్పడుతున్న గురుగ్రామ్ ఉన్మాదిని పోలీసులు రెండు రోజుల కిందట అరెస్ట్ చేశారు.
గురుగ్రామ్లోని ఓ మురికి వాడలో ఈ నెల 12న మూడేళ్ల బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ బాలిక కాలు, తలను ఇటుకతో చిధ్రం చేశారు. అంతేకాదు ఆ బాలిక ప్రైవేట్ పార్ట్స్ల్లో కర్రను పెట్టినట్టు గుర్తించారు. అ కేసును చాలెంజ్గా తీసుకున్న పోలీసులు యూపీలోని మహోబా జిల్లా గంజ్ గ్రామానికి చెందిన సునీల్ (20)గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిందితుడు విస్తుపోయిన విషయాలను వెల్లడించాడు. పనీపాటా లేకుండా గాలికి తిరిగే సునీల్ ఎక్కడైనా తిండి దొరుకుతుందా అని ఆబగా ఎదురుచూసేవాడు. ఆశ్రమాలు, ఆలయాల్లో ఆహారం, ప్రసాదాలు పెడితే తినడం, బస్టాపులు, ఫుట్పాత్లపై నిద్రపోవడం ఇది అతడి దినచర్య. ఈ క్రమంలో ఎవరైనా బాలికలు కనిపిస్తే వారికి స్వీట్లు, చాక్లెట్లు ఇస్తానని ఆశచూపించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి వారి కాలు విరగొట్టి, తలను పగలుగొట్టేవాడు. ఆ బాధతో చిన్నారులు విలవిలలాడుతుంటే తనకు విపరీతమైన వాంఛ గలిగేదని నిందితుడు పోలీసులకు చెప్పారు.
ఈనెల 11న అతను బాధిత బాలికను తీసుకెళుతుండగా గురుగ్రామ్లోని ఓ హౌసింగ్ సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమేరాల్లో నమోదైంది. రెండు రోజుల తర్వాత గురుగ్రామ్ బస్టాండు సమీపంలోని సీసీటీవీ కెమేరాలోనూ నిందితుడిని గుర్తించిన పోలీసులు ఆ దృశ్యాలను దిల్లీ, గ్వాలియర్, ఝాన్సీలకు పంపించారు. చివరకు మాగార్పుర్ గ్రామంలో నిందితుడిని పట్టుకున్నారు. పోలీసుల అతడిని మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి న్యాయస్థానం ఎనిమిది రోజుల రిమాండ్ విధించింది.