Saturday, May 18, 2024
- Advertisement -

ధనుంజయ్ ట్రావెల్స్ ని మూసేయండి – హై కోర్టు

- Advertisement -

ఫుల్లుగా తాగి బస్సు నడిపే డ్రైవర్ ని పంపించడమే కాక కనీసం ఫోన్ చేసి అడిగితే సరైన రెస్పాన్స్ కూడా ఇవ్వని ధనుంజయ్ ట్రావెల్స్ మీద పిచ్చ కోపంగా ఉన్నారు జనాలు. డ్రైవర్ ని మార్చాలి అని మెడికోలు ఎంత మొత్తుకున్నా పట్టించుకోకుండా డ్రైవర్ తో సహా నలుగురు విద్యార్ధుల ప్రాణాలు పోవడానికి కారణం అయిన ధనుంజయ్ ట్రావెల్స్ మీద హై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

వివిధ మీడియా సంస్థల్లో ప్రసారమైన.. ప్రచురించిన వార్తల్ని ప్రజాహిత వాజ్యంగా స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. తాగినడుపుతున్న డ్రైవర్ల విషయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించటంతో పాటు.. ఈ ఉదంతంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఇక.. ఈ ఉదంతానికి కారణమైన ధనుంజయ ట్రావెల్స్ ను మూసివేయాల్సిందిగా ఆదేశించింది.

ట్రావెల్స్ కంపెనీపై ఎలాంటి చర్యల్ని తీసుకున్నారన్న అంశంపై హైకోర్టు ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తెలంగాణ ఏఏజీ.. ఎవరి పర్యవేక్షణలో వాహనాల్ని నడుపుతున్నది ఆరా తీస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ కేసు మీద 18 న విచారణ జరగగా యాక్సిడెంట్ జరిగింది 14 మార్చ్ న ఇలోగా రెండు రోజల సమయం ఉన్నా ఈ ట్రావెల్స్ ఎవరి యాజమాన్యం కింద పనిచేస్తోంది అని తెలియడం లేదా దానికి అంత సమయం ఎందుకు అని కోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -