తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కి తీవ్రమైన ముప్పు ఉంది అని నిఘా వర్గాలు చెబుతున్నాయి. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆయన్ని ఇప్పుడు జెడ్ సెక్యూరిటీ రేంజ్ లో ఉంచుతున్నారు. విజయవాడ దగ్గర ఉండవల్లి కరకట్ట మీద లింగమనేని ఎస్టేట్ లో బాబు ఉంటున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రాంతం లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసారు. ఆయన ప్రస్తుతం ఉంటున్న ఇల్లు నివాస ప్రాంతాలకు దూరంగా ఉండడం… పక్కనే నది ఉండడంతో ఎటునుంచి ఏ ముప్పూ రాకుండా కాపలా కాస్తున్నారు. ఇటీవల రాజధాని ప్రాంతంలో మావోయిస్టు ఒకరు పోలీసులకు దొరకడంతో వారు ఏదైనా హాని తలపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారా అన్న అనుమానంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
చంద్రబాబు నివాసానికి వెళ్లే మార్గంలో 100 మీటర్లకు ఒక నిఘా కెమేరా ఏర్పాటు చేశారు. కరకట్టపై 5 పోలీసు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వీటిని దాటి వెళ్లడం అసాధ్యమన్న రీతిలో భద్రత ఏర్పాట్లు ఉన్నాయి. మావోయిస్టు లు ఆయన్ని గట్టిగా టార్గెట్ చేసారు అని తెలుస్తోంది.