- Advertisement -
ఓ భర్త తన సొంత భార్యపై కత్తితో ఘోరంగా దాడి చేశాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే… భర్త(అచ్చిరాజు), భార్య(సావిత్రి) పై కత్తితో దాడి చేశాడు. కుటుంబ కలహాల కారణంగా సావిత్రిపై అచ్చిరాజు ఈ దాడికి దిగాడు.
సావిత్రిపై అచ్చిరాజు దాడి చేయగా, ఆమె తప్పించుకుని పరుగులు తీసింది. ఘనపురానికి చెందిన భార్య భర్తల మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతుండటంతో భార్యను హత్య చేయాలని ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ దాడి అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి.
{youtube}Jyyud_udDoA{/youtube}