Monday, May 6, 2024
- Advertisement -

బిచ్చమైనా ఎత్తుకుంటా.. పార్టీ మారను – డి.కె.అరుణ

- Advertisement -

నాకు ఎన్ని కష్టాలు వచ్చినా బిచ్చమైనా ఎత్తుకుంటాను కాని టిఆర్ఎస్ లో మాత్రం చేరేది లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కె.అరుణ స్పష్టం చేశారు. తన తమ్ముడు, ఇటీవల టిఆర్ఎస్ లో చేరిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మెహన్ పై అరుణ కారాలు, మిరియాలు నూరారు. తన తమ్ముడు పార్టీ మారి చాలా ద్రోహం చేశాడని, గతంలో జరిగిన అవమానాలు గుర్తుకు రాలేదా అని ఆమె ప్రశ్నించారు.

తాను తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపిగా పోటీ చేసినప్పుడు తన తండ్రి చిట్టెం నర్శిరెడ్డి కాంగ్రెస్ గెలవడం కోసం కృషి చేశారని, కూతురు ఓడిపోతుందని తెలిసి కూడా ఆయన పార్టీ కోసం పని చేశారని ఆమె అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, భీమా ప్రాజెక్టు కోసం పార్టీ మారానని చెబుతున్న రాంమ్మెహన్ రెడ్డికి కాంగ్రెస్ హయాంలోనే భీమా ప్రాజెక్టు 90 శాతం పూర్తి అయ్యిందని తెలియదా అని అరుణ ప్రశ్నించారు.

2004 సంవత్సరంలో తన తండ్రిని, మరో సోదరుడ్ని నక్సలైట్లు చంపితే రాంమ్మెహన్ అనివార్యంగా రాజకీయాల్లోకి వచ్చారే తప్ప ఆయన నిజానికి రాజకీయ వారసుడు కాదని ఆమె అన్నారు. ఇటీవల టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెంపదెబ్బ తిన్న రాంమ్మోహన్ ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఆ పార్టీలో చేరాడని ఆమె మండిపడ్డారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -