స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పృథ్వీ-2 క్షిపణి పరీక్ష వరో సారి విజయవంతమైంది. అణు సామర్థ్యంతో రూపొందించిన ఈ క్షిపణిని సైన్యం నేడు ఒడిశాలోని చాందీపూర్ సమీపంలో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి పరీక్షించింది. ఉదయం 9.50 గంటలకు క్షిపణిని ట్రయల్ చేయగా.. అది విజయవంతమైందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 350 కి.మీ.దూరంలోని లక్ష్యాలను సమర్థంగా చేధించగలదు. 500 కేజీల నుంచి 1000కేజీల వార్హెడ్స్ను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. గతేడాది నవంబర్లోనూ ఇదే బేస్ నుంచి పృథ్వీ-2 క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు.
{loadmodule mod_custom,Side Ad 1}
రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారత్ డైనమిక్స్ సంస్థల సంయుక్త పరిశోధనే పృధ్వి -2 బాలిస్టిక్ మిసైల్. దీన్ని తొలిసారిగా 1996 జనవరి 27న ప్రయోగించారు. ప్రయోగ సన్నాహాల్లో భాగంగా మధ్య మధ్యలో ఇటువంటి పరీక్షలు జరుపుతుండడం పరిపాటి. 4,600 కిలోగ్రాముల బరువుండే ఈ క్షిపణి వెయ్యి కిలోల వరకు వార్ హెడ్ ను మోసుకుపోగలదు. 8.56 మీటర్ల పొడవు ఉంటుంది.
అడ్వాన్స్ ఇన్ఎరిటల్ గైడెన్స్ సిస్టమ్ సాయంతో ఈ క్షిపణి లక్ష్యాన్ని చేధించగలదు. స్ట్రాటెజిక్ ఫోర్స్ కమాండ్ బృందం పృథ్వీ-2ను పరీక్షించగా.. రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు.
Also read