- Advertisement -
అనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు అబ్బాయిలు చేసిన దుర్మార్గం సమాజం మొత్తం సిగ్గు పడాల్సి వస్తొంది.
వివరాల్లోకి వెళితే.. ఇద్దరు అమ్మాయిల చేత రాఖీ కట్టించుకొని, అన్నలా మీకు తోడుంటామని చెప్పి అత్యాచారానికి వడి గట్టారు ఇద్దరు కామ పిశాచులు. కర్నూల్ జిల్లాకు చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్ళకు అనంతపురం వజ్ర కరూర్కి చెందిన వినోద్, మహేశ్ లు మూడు సంవత్సరాల నుండి పరిచయం ఉన్నారు. మొన్న జరిగిన రాఖీ పండుగ రోజు రాఖీ కట్టించుకొని మీకు అన్నగా జీవితాంతం తోడు ఉంటామని నమ్మబలికారు. ఆ తర్వాత కర్నూల్ నుండి అనంతపురం వజ్ర కరూర్కు ఇద్దరు అమ్మాయిలను తీసుకెళ్ళి ఒక రూంలో బందించి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, అమ్మాయిలను ఆస్ర్పత్రికి తరలించారు.