దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రోద్బలంతో నటి శ్రీరెడ్డి తన తల్లిపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడిన సంగతి తెలిసిందే. వరుస ట్వీట్లతో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పవన్.. టీవీ9, ఏబీఎన్, టీవీ5 అధినేతలపై నిప్పులు చెరిగారు. న్యూస్ ఛానెల్ టీవీ9 కొన్ని రోజులగా ఉదయం నుంచి రాత్రి వరకు అసభ్యకరంగా డిబేట్లు నిర్వహించింన సంగతి తెలిసిందే.
అనంతరం మెగా ఫ్యామిలితో కలిసి ఫిల్మ్ చాంబర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి భారీ ఎత్తున చేరుకున్న అభిమానులు మీడియాపై ఆగ్రహంతో ఏబీఎన్ వాహనాలను ధ్వంసం చేశారు. నేపథ్యంలో పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం అభిమానులను ఉద్దేశించి పలు ట్వీట్లు చేశారు.
రేపు శ్రీని రాజు తనపై పరువునష్టం దావా వేస్తున్నారని, తన ఫ్యాన్స్ శాంతియుతంగా ఉండాలని, ఎటువంటి విధ్వంసకర చర్యలకు పాల్పడకూడదని కోరారు. అలాగే, తాను కూడా ఆ ఛానెల్ హెడ్లపై సుదీర్ఘంగా న్యాయపరమైన యుద్ధం చేస్తానని ప్రకటించారు.
శ్రీనిరాజుకు టీవీ9లో పెట్టుబడులు ఉన్నాయి. అంతేకాదు, అతనికి సత్యం రామలింగరాజు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కూడా సంబంధాలున్నాయి’’ అని పవన్ ట్వీట్ చేశారు. ఈ వ్యవహారం ఎలాంటి సంచలనాలకు దారి తీస్తుందో చూడాలి.
Boycott TV9, TV5, ABN for abusing our Mothers,Daughters & Sisters
And also we have to boycott them for making business out of nudity & profanity.Making business out of a helpless sister ..— Pawan Kalyan (@PawanKalyan) April 20, 2018