- Advertisement -
సినీగేయసాహిత్యంలో కూడా దేశభక్తి గీతాలకు, స్వాతంత్య్రకాంక్షతో రాసిన గీతాలకు ప్రముఖస్థానం ఉంది.
ఇప్పటివరకు తెలుగు సినిమాపాటలు 300వరకూ దేశభక్తికి సంబంధించినవి వచ్చినట్టు అంచనా. దేశభక్తిని తట్టిలేపే పాటలకు మన తెలుగు సాహితీవేత్తలు,నటీనటులు ఆనాడే అంకురార్పణ చేశారు.అప్పటి తరం వారు దేశభక్తికి తమ గౌరవ వందనాన్ని పాట రూపంలో ఇవ్వడానికి ఎపుడూ ఉవ్వీళ్లూరుతూ ఉండేవారు.
ఆనాటి ప్రముఖ సినీ గేయకవులైన సముద్రాల రాఘవాచార్య, మల్లాది రామకృష్ణశాస్త్రి, కొసరాజు, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆత్రేయలాంటివారు ఎంతో ఉద్వేగభరితంగా, ఉత్తేజభరితంగా దేశభక్తి గీతాలు రాసి ఖ్యాతి పొందారు.నేటి రోజుల్లో కూడా జెండాకు ఇచ్చే గౌరవం ఎవరి రీతిలో వారు ఇస్తూనే ఉన్నారు.
