Tuesday, May 21, 2024
- Advertisement -

స్వామివారి మొక్కు తీర్చుకున్న సీఎం కేసీఆర్

- Advertisement -
KCR visits Tirumala

తెలంగాణ సీఎం.. కేసీఆర్ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారికి మొక్కు ను తీర్చుకున్నారు. నిన్న సాయంత్రం కుటుంబసభ్యులతో తిరుమలకు చేరుకున్న కేసీఆర్ కి ఏపీ ప్రభుత్వం ఘన స్వాగతం పలికారు. ఈరోజు తెల్లవారు జామున దంపతులు సంప్రదాయం ప్రకారం స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ర్ట మొక్కును ముఖ్యమంత్రి తీర్చుకున్నారు. శ్రీవారికి రూ. 3 కోట్ల విలువైన 14.2 కిలోల సాలగ్రామహారం, రూ. కోటీ 21 లక్షల విలువైన 4.65 కిలోల మకరకంఠిలను ఆలయ ప్రధాన అర్చకులు, నిర్వాహాకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేశారు. మొక్కు తీర్చుకున్న అనంతరం కేసీఆర్ మీడియా తో మాట్లాడారు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాలు దేశంలోనే అభివృద్ధి రాష్ర్టాలుగా ఉండాలని.. శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -