Friday, April 19, 2024
- Advertisement -

టీడీపీ ఎంపీ కేశినేని నానికి కోవిడ్ పాజిటివ్!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేసుల ఉధృతి మాత్రం తగ్గటం లేదు.  రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ కూడా కరోనా బారిన పడ్డారు.  

ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నానికి కరోనా సోకింది. ఆయన ఇటీవల కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. వారం రోజులవ్యవధిలో ఆయనకు కరోనా సోకడం గమనార్హం. డియర్ ఆల్, నాకు కరోనా పాజిటివ్ అని ఈరోజు తేలింది. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. నాకు నేను సొంతంగా హోం క్వారంటైన్‌కు వెళ్తున్నాను.

మా ఇంట్లోనే కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను నేరుగా కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోండి, వీలైతే ఐసోలేషన్‌కు వెళ్లాలని’ టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్ ద్వారా కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -