Sunday, May 5, 2024
- Advertisement -

కెసిఆర్ కి షాక్ ఇస్తున్న కోదండరాం

- Advertisement -

తెలంగాణా ఉద్యమంలో ఏమీ ఆశించకుండా కీలక భూమిక పోషించి రాష్ట్రం చేతికి దక్కిన తరవాత కూడా ఎలాంటి పదవీ ఆశించకుండా పనిచేసిన నిజమైన వ్యక్తి కోదండరాం గా చెబుతారు. ప్రొఫెసర్ కోదండరాం ఈ మధ్య కాలం లోనే రిటైర్ అయ్యారు.

తెలంగాణా జేఏసీ నాయకుడు అయ్యుండీ తెలంగాణా సాధన జరిగిన తరవాత ఏ పదవినీ చేపట్టకుండా మళ్ళీ వెనక్కి తన బోధన వైపే వెళ్ళిపోయారు ఆయన. 

అలాంటి వ్యక్తి ఇప్పుడు అధికార పక్షానికి, కెసిఆర్ కి భారీ షాక్ ఇవ్వబోతున్నారు అని తెలుస్తోంది. విపక్షాలు ఇప్పటివరకూ చెయ్యలేకపోయిన పనిని కోదండరాం ఒక్కరే చెయ్యబోతున్నారు అని అనిపిస్తోంది. తాజాగా ఉమ్మడి రాష్ట్రాల హై కోర్టు లో కోదండరాం వేసిన పిటీషన్ రాజకీయవర్గాల్లో పెద్ద టాపిక్ అయ్యింది. తెలంగాణా లో వరస ఆత్మహత్యల విషయం లో మాస్టారు వేసిన ఇంప్లీడ్ పిటీషన్ తెలంగాణా రాజకీయాన్ని ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. 

తెలంగాణా ఉద్యమంలో కెసిఆర్ తోనే ఉండి పోరాడారు అని చెప్పే కోదండరాం పేరు కోసం పదవుల కోసం తెలంగాణా వచ్చిన తరవాత వెంపర్లాడినట్టు ఎక్కడా కనపడదు. వారం రోజుల క్రితం వ్యవసాయ జన చైతన్య సమితి అనే సంస్థ రైతు ఆత్మహత్యల మీద పిటీషన్ ని కోర్టు లో వేసింది, తాజాగా ఇప్పుడు కోదండరాం తెలంగాణా విద్యావంతుల వేదిక తరఫున ఏకంగా ఇంప్లీడ్ పిటీషన్ వేసేసారు. రైతుల ఆత్మహత్యలను ప్రోత్సహించేలా 

ప్రభుత్వ తీరు ఉంది అని అందులో పేర్కొనడం గమనార్హం. ఈ పిటీషన్ కు ఇంప్లీడ్ పిటీషన్ వేసిన కోదండరాం.. రైతు ఆత్మహత్యలు పెరిగాయని.. ఈ అంశంపై తాము సమగ్ర సర్వే నిర్వహించామని.. తమ వద్ద నివేదిక ఉందని పేర్కొన్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -