వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మూడో విడత రైతు భరోసా యాత్ర అనంతపురంలో కొనసాగుతున్న నేపథ్యంలో టిడిపి కో-ఆర్డినేటర్ నారా లోకేశ్ జగన్పై ట్విట్టర్ ద్వారా పలు విమర్శలు చేశారు. ఎందుకు జగన్ పట్టి సీమ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వడంలేదని ప్రశ్నించారు.
జగన్ పొలిటికల్ యాత్రలు చేసుకుంటూ మొసలికన్నీరు కారుస్తున్నాడంటూ రైతు భరోసా యాత్రను ఉద్దేశించి మండిపడ్డాడు. జగన్ చేస్తున్న యాత్రలు రాజకీయం కోసమే అని లోకేశ్ పేర్కొన్నారు.
జగన్ రైతు భరోస యాత్రలో టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెలుతున్నారు. అలాగే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఓదారుస్తూ వాళ్ళకు ధైర్యం చెప్పటం కోసం రైతు భరోస యాత్రను ప్రారంభించారు.
మొదటి విడత రైతు భరోసా యాత్ర ప్రిబ్రవరి 22వ తేది ప్రారంబించి అదే నెల 26వ తేదీకి పూర్తి చేశారు. రెండో విడత యాత్ర మే 11th ప్రారంబించి అదే నెల 18th న ముగించారు. ఇప్పుడు అనంతపురంలో మూడో విడత రైతు భరోసా యాత్రను మంగళవారం ప్రారంబించారు. ఈ రోజు కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజక వర్గంలో జగన్ ప్రర్యటించనున్నారు. అక్కడే సెత్తూరు మండల హెడ్ క్వార్టర్స్ దగ్గర మీటింగ్లో పాల్గొంటారని సమాచారం.