Wednesday, May 15, 2024
- Advertisement -

నంద్యాలలో వైసీపీకి మహేష్ మద్దతు..?

- Advertisement -

నంద్యాల ఉపఎన్నికలకు టైం దగ్గర పడింది. పోలీంగ్ కు కొన్ని రోజులే ఉండటంతో.. ఇరు పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచారు. ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు సినీ పరిశ్రమ ప్రముఖులను ను జోడిస్తున్నారు. హీరో బాల‌కృష్ణ.. భూమా బ్ర‌హ్మానంద రెడ్డి త‌ర‌పున ప్రచారంలో పాల్గొంటారని.. టీడీపీ లీడర్లు అంటున్నారు.

ఇక కమెడియమ్ వేణుమాధవ్ ఇప్పటికే నంద్యాల్లో టీడీపీ త‌ర‌పున ప్ర‌చారం చేస్తూనే ఉన్నారు. ఇక వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డికి మద్దతుగా సూపర్ స్టార్ మహేష్ బాబును రంగంలోకి తీసుకొని రావాలని భావిస్తున్నారట. మ‌హేష్ బాబాయి అయిన ఆదిశేష‌గిరి రావు వైసీపీలోనే కొన‌సాగుతుండ‌టంతో ఎలాగైనా మ‌హేష్ బాబును ప్ర‌చారానికి తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు. కానీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న.. మహేష్ నంద్యాల కోసం వ‌స్తాడో లేదో అనే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశార‌ట ఆదిశేష‌గిరిరావు.

ఒక‌వేళ ప్రిన్స్ రాలేక‌పోయినా,వైసీపీకి ఓటేయాల‌ని మ‌హేష్ తో స్టేట్ మెంట్ ఇప్పించాల‌ని కోరుతున్నార‌ట వైసీపీ నేత‌లు. మ‌హేష్ ఏమో కానీ,ఆయ‌న ఫ్యాన్స్ అంతా శిల్పాకే మ‌ద్ద‌తుగా ఉంటార‌ని,రేప‌ట్నుంచి త‌న వెంట మ‌హేష్ బాబు అభిమాన సంఘాల లీడ‌ర్లు,ఫ్యాన్స్ అంతా ప్ర‌చారానికి వ‌స్తార‌ని హామీ ఇచ్చార‌ట ఆదిశేష‌గిరి రావు.దీంతో వైసీపీకి కొంత‌మేర‌కు సినీ గ్లామ‌ర్ తోడైన‌ట్లే నంద్యాల ప్ర‌జ‌లు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -