Wednesday, May 1, 2024
- Advertisement -

ఇంకో ఆరు నెలల వరకు మాస్కులు..!

- Advertisement -

కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలంటే ఇంకో ఆరు నెలల వరకు మాస్కులు ధరించాల్సిందేనని మాహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మాస్క్​ను వాడకాన్ని అలవాటుగా మార్చుకోవాలని పేర్కొన్నారు ఠాక్రే.

వైద్య నిపుణులు.. రాత్రి కర్ఫ్యూ, లాక్​డౌన్​ విధించాలని సూచిస్తున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని తాను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా వైరస్​ కేసులు తగ్గుముఖం పట్టాయన్న ఠాక్రే.. ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదన్నారు.

దేశంలోనే అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఇప్పటివరకు అక్కడ 18.92 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు. వారిలో 48వేల 648 మంది చనిపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -