Saturday, April 20, 2024
- Advertisement -

దేశానికి మేఘా రక్షణ కవచం

- Advertisement -

దేశ ఇంజనీరింగ్ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) తాజాగా మరో ప్రతిష్టాత్మక రంగంలోకి ప్రవేశించింది.. దేశానికి సేవ చేసే భాగ్యాన్ని దక్కించుకుంది. మౌలిక వసతుల నిర్మాణ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు పైగా విస్తరించిన మేఘా సంస్థ తాజాగా దేశ రక్షణకు సంబంధించిన ఆయుధాలను, పరికరాలను తయారు చేసేందుకు అనుమతిని సంపాదించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరియు వాణిజ్య పారిశ్రామిక శాఖల నుంచి అనుమతులు అందుకుంది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఇందుకు సంబంధించిన పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు మంత్రిత్వ శాఖల నుంచి అనుమతులు సంపాదించింది.

కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా విధానంలో భారత్ లోనే రక్షణ పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించింది. ఈ క్రమంలోనే డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ 2020 కి అనుగుణంగా రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు, వాహనాలు, విడిపరికరాలు, సాయుధ సంపత్తి ఉత్పత్తి చేసేందుకు అనుమతి కోరుతూ ఎంఈఐఎల్ దరఖాస్తు చేసుకుంది. నిబంధనలకు అనుగుణంగా సంస్థ శక్తి-సామర్థ్యాలను పరిశీలించిన తరువాత కేంద్ర ప్రభుత్వం మిలటరీకి వాహనాలను ఆయుధాలతో సహా ఉత్పత్తి చేసే విధంగా అనుమతులను జారీ చేసింది. వివిధ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సంస్థ శక్తి-సామర్థ్యాలను పరిశీలించిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఈ అనుమతులను జారీ చేసింది. వివిధ దశల్లో 500 కోట్ల పెట్టుబడితో మేఘా గ్రూప్ ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.

దేశంలో నిర్మాణ, మౌలిక వసతుల రంగంలో అడుగుపెట్టి ఆ తరువాత చమురు-ఇంధన వాయువు, విద్యుత్, సౌరవిద్యుత్, విమానయాన రంగంలో విస్తరించిన మేఘా ఇంజనీరింగ్ తాజాగా దేశ రక్షణకు సంబంధించిన పరికరాల ఉత్పత్తి రంగంలో ప్రవేశించి అద్భుతం సృష్టించింది. తెలుగు వారి ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేసింది. ఈ పరిణామంతో మేఘా అమ్ముల పొదిలో మరో ఆయుధం చేరింది.

రక్షణ రంగానికి సంబంధించి….

ఎంఈఐఎల్ ఏర్పాటు చేసే డిఫెన్స్ పరిశ్రమలో ప్రధానంగా యుద్ధట్యాంకులు.. వాటికి సంబంధించిన విడి పరికరాలు, తేలికపాటి యుద్ధ వాహనాలు, ఆర్మర్డ్ ఇంజనీర్ వెహికిల్స్, ఆర్మర్డ్ రికవరీ వెహికిల్స్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా సైనికులను తీసుకువెళ్లే వాహనాలు (ఏపిసి) ఇన్ఫ్యాన్ట్రీ కంబాట్ వెహికిల్స్ (ఐసివి), సాయుధ బహుళ వినియోగ వాహనాలు, మైన్ లేయింగ్ వెహికిల్స్, బ్రిడ్జ్ లేయింగ్ వెహికిల్స్, అన్ని ప్రాంతాల్లోనూ తిరగగలిగే యుద్ధ వాహనాలు (ఏసిటివి) మొదలైనవి ఉత్పత్తి చేస్తుంది. యుద్ధ వ్యూహతంత్రానికి సంబంధించిన వాహనాలు (టిఎంఏవి), మందపాతరలను తట్టుకోగలిగే వాహనాలను కూడా ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా మిస్సయిల్స్, మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్, మిషన్ గన్స్, రాకెట్లు, ఫిరంగులు (క్యానన్) ఉత్పత్తి చేసేందుకు మేఘాకు అనుమతి లభించింది.

దేశంలో తొలి వైరాలజీ ల్యాబ్…

మేఘా గ్రూప్ కి చెందిన పూర్తి అనుబంధ సంస్థ అయిన ఐకామ్ టెలి లిమిటెడ్ ఇప్పటికే దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన వివిధ విభాగాలకు శాస్త్ర-సంకేతిక రంగాల్లో సహాయ-సహకారాలు అందిస్తున్న విషయం విధితమే. ఐకామ్ సంస్థ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ కమ్యునికేషన్ తో పాటు విద్యుత్ ప్రసారం పంపిణీ, సౌర రంగల్లో కూడా నిమగ్నమై ఉంది. ఇప్పటికే ఈ సంస్థ అధునాతన కమ్యూనికేషన్ రెడియోలు, జామర్లు, ఈడబ్లూ షెల్టర్స్, యాంటినాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కంటెయినర్లు, విండ్ ప్రొఫైల్స్ రాడర్లను అభివృద్ధి చేసి సరఫరాలో నిమగ్నమయి ఉంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఐకామ్ తయారు చేసిన మొబైల్ వైరాలజీ ల్యాబ్ను గత ఏప్రిల్ నెలలో ప్రారంభించిన విషయం తెలిసిందే.

మేఘా ఇంజనీరింగ్ దేశ, విదేశాల్లో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ పూర్తి చేసింది. సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణం, సహజ-చమురు , తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పంపిణీ, రోడ్డు మార్గాల ఆధునీకరణ, విస్తరణ విమానాయన రంగాలో ఎన్నో విజయాలు సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేస్తోంది. ఇప్పుడు రక్షణ రంగంలోకి కూడా దిగి దేశానికి సేవ చేసే భాగ్యం దక్కించుకుంది. తెలుగువారికే గర్వకారణంగా నిలిచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -