క్యాస్టింగ్ కౌచ్ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులముకుంది. నిన్నటి వరకు సినీపరిశ్రలో కొనసాగిన వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సీరియస్ అయ్యింది. శ్రీరెడ్డి వివాదంలో వర్మ జోక్యం చేసుకోవడంతో వివాదం ముదురి పాకాన పడింది. పవన్ను నేనే టార్గెట్ చేయమని శ్రీరెడ్డికి చెప్పాలనని వర్మ చెప్పిన సంగతి తెలిసిందే.
వర్మపై మెగా ఫ్యామిలీ సీరియస్ అయ్యింది. ఫిల్మఛాంబర్ ముందు మెగా ఫ్యామిలీ కుటుంబం అంతా నిరసన దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. రేపటిలోగా వర్మపై మా చర్యలు తీసుకోకుంటూ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని పవన్ చెప్పడంతో నష్ట నివారణ చర్యకు తెలంగాణా ప్రభుత్వం పూనుకుంది.
ఈ విషయంపై తెలంగాణ సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రేపు రాష్ట్ర పోలీసు ఉన్నతాధి కారులు, సినీ ప్రముఖులతో సమావేశం కానున్నారు. కాగా, సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ పలువురు మహిళా నటులు ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే.
తెలుగు వారికి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల యువనటి శ్రీరెడ్డి ఈ విషయంపై నిరసన తెలపడంతో ఈ ఆరోపణలు మరింత పెరిగిపోయి, కీలక మలుపులు తిరిగి టాలీవుడ్ని కుదిపేస్తున్నాయి. జాతీయ మీడియాలోనూ టాలీవుడ్ తీరుపై చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం రిపోర్ట్ ఇవ్వాలని సెంట్రల్ హ్యూమన్ రైట్స్ కమిషణ్ ఆదేశించింది. ఇది మరింత ముదరకుండా ప్రభుత్వం రంగంలోకి దిగుతోంది.