Friday, May 3, 2024
- Advertisement -

అప్పులు ఆంధ్రాకి… ఆస్తులు తెలంగాణాకి – చంద్రబాబు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది పొట్టకొట్టిన రోజు అని, ఇది ఇటలీకి స్వాతంత్రం వచ్చిన రోజు అని ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఆయన అధికారులు, మంత్రులు, ప్రజల చేత నవ నిర్మాణ దీక్ష చేయించారు.

ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. రాష్ట్రం విడిపోకుండా చేయాలని ఎంత ప్రయత్నించినా ఆగలేదని అన్నారు. విభజన సందర్భంగా అప్పులు ఆంధ్రప్రదేశ్ కి, ఆస్తులు తెలంగాణకి వచ్చాయని, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు విభజన చేసిందని దుమ్మెత్తారు. కట్టు బట్టలతో హైదరాబాద్ నుంచి బయటకు పంపించారని, విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో కోల్పోయిందని అన్నారు. నవ నిర్మాణ దీక్ష చేపట్టిన వారందరికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -