Saturday, April 20, 2024
- Advertisement -

దేశ ప్రజలకు నూతన సంవత్సరం బహుమతి..!

- Advertisement -

దేశ ప్రజలకు నూతన సంవత్సరం బహుమతి ఇవ్వడానికి కేంద్రం సిద్ధమైంది. భారత్​లోనే తొలి సారిగా ఆటోమేటెడ్​ డ్రైవర్​ రహిత రైలు​కు ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపనున్నారు. డిసెంబర్​ 28న వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా దీనిని ప్రారంభించనున్నట్లు.. దిల్లీ మెట్రో రైల్​ కార్పోరేషన్(డీఎంఆర్​సీ)​ స్పష్టం చేసింది. ఇదొక పెద్ద సాంకేతిక విజయమని పేర్కొంది.

ఢిల్లీ మెట్రోలోని పది కారిడార్లలో ఎన్​సీఎంసీ మొదటిసారిగా వినియోగంలోకి రానుంది. ‘వన్​ నేషన్​-వన్​ కార్డ్’ నినాదంలో భాగంగా దీనిని 2019 మార్చిలో మోదీ ప్రారంభించారు.2002 డిసెంబర్ 25న అప్పటి ప్రధాని వాజ్​పేయీ ఢిల్లీ మెట్రోను ప్రారంభించారు. మొదట 6 స్టేషన్లతో 8.2 కి.మీ.ల పొడవుతో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డీఎంఆర్​సీకి 242 స్టేషన్లు ఉన్నాయి. రోజుకు 26 లక్షల ప్రజలు దిల్లీ మెట్రో ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -