Sunday, May 19, 2024
- Advertisement -

పోలవరం బాధ్యత కేంద్రానిదే

- Advertisement -

విశాఖ పట్నంలో కొత్త రైల్వేజోన్ ఏర్పడనున్నదని, కేంద్రం త్వరలో ఈ అంశంపై ఓ ప్రకటన చేయనున్నదని లోక్ సభ విశాఖపట్నం సభ్యుడు కంభంపాటి హరిబాబు చెప్పారు. కేంద్రంలో నరేంద్రమోదీ రెండేళ్ల పాలన పూర్తి అయిన సందర్భంగా జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

విశాఖను రైల్వే జోన్ గా ప్రకటించాలన్న డిమాండ్ కు త్వరలో కార్యరూపం దాల్చనున్నదని అన్నారు. ఈ రెండేళ్ల పాలన అవినీతి రహిత, అభివ్రద్ధే ధ్యేయంగా సాగిందని, ఎపికి ప్రత్యేక హోదా రాకున్నా అంతకు మించి ఎక్కవ సాయమే అందుతోందన్నారు. రాజధాని ప్లాన్ లేనప్పుడే కేంద్రం రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని, ప్రతిపాదనలు పంపితే మరిన్ని నిధులు ఇస్తుందని చెప్పారు. అలాగే పోలవరం ప్రాజుక్టును కేంద్రమే నిర్మిస్తుందని ఆయన స్పష్టం చేశారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -