- Advertisement -
పాతబస్తీ డబీర్పూరాలోని నిజాం మ్యూజియంలో భారీ దొంగతనం జరిగింది. మ్యూజియంలోని విలువైన వస్తువులను దొంగలు అపహరించారు. బంగారం పూతతో ఉన్న కప్పు, సాసర్, స్పూన్లను దుండగులు చోరీ చేశారు. ఈ ఘటనపై మ్యూజియం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చోరీపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. మ్యూజియంలోని సిసిటివి పుటేజీలను పోలీసులు పరిశీలించారు. మ్యూజియం చుట్టూ ఉన్న పది కెమెరాల కన్నుగప్పి దుండగులు చోరీ చేశారు.