ఏపీ-తెలంగాణ సరిహద్దుల వద్ద తెలంగాణ పోలీసులు కొత్త ఆంక్షలు విధించారు. రోగులతో కూడిన అంబులెన్స్లను తెలంగాణలోకి రానివ్వొద్దంటూ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో.. సరిహద్దుల్లో పోలీసులు ఎక్కడివక్కడ ఆపేస్తున్నారు. అంతే కాదు.. ఏపీ అంబులెన్స్లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆస్పత్రి అనుమతి పత్రాలు తప్పనిసరి అని తెలంగాణ పోలీసులు అంటున్నారు.
ఇటీవల తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణలో ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మేషన్, ఆసుపత్రి నుంచి అనుమతి ఉంటేనే అంబులెన్స్లకు అనుమతి ఇస్తున్నారు.
తెలంగాణలో ఆక్సిజన్, బెడ్స్ కొరత కారణంగా ఇతర రాష్ట్రాల రోగులకు అనుమతి నిరాకరిస్తున్నారు. తెలంగాణలోకి వెళ్తున్న కోవిడ్ బాధితుల అనుమతిపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అయితే సాధారణ ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తున్నారు.
సినీ నటుడు జూ.ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్