Saturday, April 27, 2024
- Advertisement -

సినీ నటుడు జూ.ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్

- Advertisement -

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ సెలబ్రెటీలు కరోనా భారిన పడుతున్నారు. కొంత మంది కరోనా కాటుకు బలి అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో నటులు, దర్శక, నిర్మాతలు కరోనా కాటుతో చనిపోయారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో పవన్, వరుణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కి కరోనా వచ్చింది. సరైన చికిత్స తీసుకొని వీరంతా కరోనాని జయించారు.

తాజాగా జూ. ఎన్టీఆర్ కి కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు జూ.ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ లో ఈ విషయాన్ని పోస్టు చేసి వెల్లడించారు. ‘కొవిడ్-19 టెస్టు చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. బాధపడకండి. నేను బాగానే ఉన్నా. ఫ్యామిలీతో పాటు నేను ఐసోలేషన్ లో ఉన్నాం. డాక్టర్ల సూపర్‌విజన్‌లోనే ఉన్నాం. నాతో కొద్ది రోజుల క్రితం వరకూ కలిసిన వారంతా టెస్టులు చేయించుకోండి. సేఫ్ గా ఉండండి’ అంటూ పోస్టు పెట్టారు.

గత కొంత కాలంగా ఎన్టీఆర్ కరోనా నియంత్రణ కొరకు మాస్క్ పెట్టుకోండి, వ్యాక్సిన్ వేయించుకోండి అంటూ ప్రచారం చేస్తున్న ఎన్టీఆర్ కరోనా భారిన పడటంతో సినీ ప్రపంచం అంతా ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -