ఒక్కొక్క రకమైన అవసరం మనిషిని రాతి మనిషి రోజుల దగ్గర నుంచీ స్మార్ట్ ఫోన్ రోజుల వరకూ తీసుకుని వచ్చింది. ప్రతీ అవసరం మనిషి పరిణామం లో కొత్త పునాదిని వేస్తూ సాగింది. అవసరం , అసహాయత ఇవన్నీ కొత్త కొలువులు సృస్టిస్తాయి అనడానికి ఇదే ప్రత్యేక్ష ఉదాహరణ. మోడీ ఇచ్చిన పెద్ద నోట్ల రద్దు వ్యహ్వారం దేశం లో ఎంతటి చిచ్చు రేపుతోందో అందరికీ తెలిసిందే. ముందు చూపు లేకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ తీవ్ర నిర్ణయం కారణంగా బ్యాంకుల ముందరా ఏటీఎం సెంటర్ ల ముందరా అతిపెద్ద క్యూలు ఉంటున్న సంగతి తెలిసిందే.
గంటలకి గంటల పాటు దాదాపు 14 రోజుల నుంచీ ప్రతీ రోజూ క్యూల నిండా జనాలు నిండుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇలాంటి సమస్యల్ని తీర్చేందుకు తాజాగా ఒక ఆన్ లైన్ సేవలు అందుబుటులోకి వచ్చాయి.అదేమంటే.. బ్యాంకు సేవల్ని వినియోగించటం కోసం క్యూలలో గంటల తరబడి నిలుచునే ఇబ్బంది లేకుండా.. గంటల చొప్పున క్యూలో నిలుచోవటానికి కూలీల్ని తాము సరఫరా చేస్తామని ముందుకొచ్చిందో సంస్థ.
‘‘బుక్ మై చోటు. కామ్’’ పేరిట గంటకు రూ.90చొప్పున అద్దెకు తీసుకుంటే చాలు.. అలా అద్దెకు తీసుకున్న వ్యక్తి తరపున బ్యాంకు బయట క్యూలో నిలచుంటారు. అయితే.. వారు బ్యాంకు లోపలకు మాత్రం వెళ్లరు. బ్యాంకు లోపలి వెళ్ళే సమయానికి సరిగ్గా మనం వచ్చి కూలీ స్థానాన్ని రీప్లేస్ చెయ్యచ్చు. ఈ సేవలు ప్రస్తుతం డిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్ లో నడుస్తున్నాయి. ఆన్ లైనే లో రిజిస్టర్ చేసుకోవచ్చు లేదా 8587028869 నెంబరుకు కాల్ చేయాల్సి ఉంటుందని సదరుసంస్థ చెబుతోంది.