- Advertisement -
కాంగ్రెస్ కార్యకర్త మునికోటి మృతి చెందారు. ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం తిరుపతిలో కోటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తీవ్ర గాయాలపాలైన అతన్ని చెన్నైకి తరలించారు. ఆదివారం కేఎంసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
మునుకోటి మృతి చెందడంపై ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ విచారం వ్యక్తం చేశారు.
మునుకోటి మృతి బాధ కలిగించిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.