అమావాస్య కి ఒక సారి పౌర్ణమి కి ఒకసారి తొంగి చూస్తాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక్కొక్కసారి తానే అందరికీ తోడు ఉంటాడు అని చెబుతూనే మరొక సారి ఏమీ పట్టవు తనకి అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు. సందర్భోచితంగా మాట్లాడడం , ప్రవర్తించడం తో పవన్ మీద ఆయన సొంత నియోజికవర్గం ‘కాపు’ నాయకులు పెద్ద పెద్ద ఆశలే పెట్టుకున్నారు అందులో ఎలాంటి ప్రశ్నా లేనేలేదు.
తమ సామాజిక వర్గం సంగతి పైకి పట్టించుకోను అని కళ్యాణ్ చెప్పచ్చు కానీ వారు మాత్రం కళ్యాణ్ రూపం లో ఒక బలమైన నాయకుడు దొరికాడు అని సంబరపడిపోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా నిజం. కానీ ఆయన తాజాగా చేస్తున్న పనులతో కాపులు ఆయన వైపు నుంచి తప్పుకునే ప్రమాదం ఉంది అంటున్నారు విశ్లేషకులు.
ఎక్కడో కేరళలో షూటింగ్ ఆపేసి మరీ.. హఠాహుటిన వచ్చి రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన మాట్లాడారు. అయితే, ఈమాటలు కాపు సామాజిక వర్గానికి పెద్దగా రుచించినట్టు లేదు అనే అభిప్రాయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కాపులకి రిజర్వేషన్ ఇవ్వాలా ఒద్దా అనే విషయం లో అతను అసలు తన శైలి స్పష్టంగా చెప్పలేదు అనేది వారి ఆరోపణ.ఒక పక్క ముద్రగడ ఉద్యమానికి తాను సపోర్ట్ ఇస్తున్నట్టు మాట్లడేలేదు అలాగే రిజర్వేషన్ ఇవ్వద్దూ అనీ చెప్పలేదు.
కాపు నాయకుడిగా నెత్తిన పెట్టుకుని ఆయన మొఖం చూసి తెలుగు దేశం కి ఓటు వేస్తే ఇప్పుడు తీరిగ్గా వచ్చి కళ్యాణ్ ఇలా మాట్లాడ్డం బాలేదు అంటున్నారు వారు. పవన్ తమ కులస్తులని మోసం చేసాడు అని వాపోతున్నారు కాపు జనాలు. పవన్ మారిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయని చెప్పుకుంటున్నారు. పవన్పై వారు ఎక్కువగా ఆశలు పెంచుకున్నారా..? లేదా, పవన్ వారిలో మొదట్నుంచీ ఆశలు పెంచేశారా…?