Tuesday, May 21, 2024
- Advertisement -

2 గంటలు.. ఐదుగురు పాక్ సైనికులు హతం..!

- Advertisement -

జమ్ముకశ్మీర్​లోని పూంచ్​ జిల్లా నియంత్రణ రేఖ వెంబడి సైనిక బలగాలు నిర్వహించిన ప్రతీకార దాడుల్లో ఐదుగురు పాకిస్థాన్​ సైనికులు హతమయ్యారు. మరో ముగ్గురు గాయపడినట్టు రక్షణశాఖ ప్రకటించింది. ఈ ఘటనలో పాక్​ బంకర్లనూ ధ్వంసం చేసినట్టు పేర్కొంది.

పూంచ్​ జిల్లాలోని మాన్​కోట్​ సెక్టర్​లో భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని గురువారం కాల్పులకు తెగబడింది పాకిస్థాన్​. విచక్షణారహితంగా జరిపిన ఈ దాడుల్లో.. భారత పౌరులకు ఆస్తి నష్టం కలిగింది. ఈ నేపథ్యంలో ఎదురుదాడికి దిగింది భారత సైన్యం. సుమారు 2 గంటల పాటు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ క్రమంలోనే ఐదుగురు పాక్​ సైనికులను మట్టుబెట్టింది భారత ఆర్మీ.

ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటివరకు 3,200 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్​. ఈ ఘటనల్లో మొత్తం 30 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -