- Advertisement -
వైసీపీ అధ్యక్షుడు జగన్ ను హస్తిన పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలని కోరుతూ జంతర్ మంతర్ వద్ద వైసీపీ ధర్నా నిర్వహించింది.
అనంతరం పార్లమెంట్ కు జగన్, వైసీపీ శ్రేణులు ప్రదర్శగా బయలుదేరారు. పోలీసులు వీరిని అడ్డుకున్నారు.
జగన్ మీడియాతో మాట్లాడుతూ నాతోపాటు 7 మంది ఎంపీలు, 66 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కూడా అరెస్టు అయ్యామని, కారణం ఆంధ్రా రాష్ట్రం నుంచి వచ్చిన ఇంతమంది అమాయకులకు దెబ్బలు తగలకూడదనే ఒకే ఒక కారణమని…ప్రజాస్వామ్యం ఇలా ఉంది అని చెప్పడానికి సిగ్గుతో అందరం తలవంచుకున్నామని జగన్ వ్యాఖ్యానించారు.