Thursday, May 16, 2024
- Advertisement -

మోడీని కలిసిన ప్రభాస్

- Advertisement -

ప్రధాని నరేంద్రమోడీని ఢిల్లీలో టాలీవుడ్ హారో ప్రభాస్ తన పెదనాన్న కృష్ణంరాజుతో కలిసి సమావేశమయ్యారు. దాదాపు 10 నిమిషాలపాటు ప్రధానితో వీరి భేటీ సాగింది. 

ఈ సదర్భంగా ప్రధాని మోదీ బాహుబలి చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించినట్లు తెలిసింది. మోదీతో భేటీ అనంతరం కృష్ణంరాజు, ప్రభాస్ మీడియాతో మాట్లాడారు. బాహుబలి సినిమా గురించి విన్నానని ఈ చిత్రం చాలా బాగుందని తనకు చాలా మంది చెప్పారని మోదీ అన్నట్లు కృష్ణంరాజు తెలిపారు.

ప్రభాస్ మాట్లాడుతూ మోదీతో 10 నిమిషాలు మాట్లాడామని, ఆయనతో మాట్లాడటం చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు. బాహుబలి సినిమా చూడాలని తాను ప్రధానిని కోరగా ప్రస్తుతం బిజీగా ఉన్నానని, తప్పకుండా చూస్తానని చెప్పారని ప్రభాస్ తెలిపారు. తన జీవితంలో ఈ రోజు చాలా సంతోకరమైనదని ప్రభాస్ ఉబ్బితబ్బిబ్బైపోయారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -