- Advertisement -
పంజాబ్ లోని గురుదాస్పూర్లో ని బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 19 అక్కడికక్కడే మణించగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.మరో 50 మంది ఫ్యాక్టరీలో చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి బాణసంచా ఫ్యాక్టరీ భవనం పూర్తిగా దెబ్బతింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఓ పెళ్లి వేడుక కోసం బాణసంచా తయారుచేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నాయి.
బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పేలుడు దాటికి బాణసంచా ఫ్యాక్టరీ పూర్తిగా కుప్పకూలిందని పేర్కొన్నారు. ఫ్యాక్టరీ సమీపంలోని భవనాలు కూడా దెబ్బతిన్నాయని వెల్లడించారు.