Thursday, May 9, 2024
- Advertisement -

బెదిరింపు కాల్స్ చేస్తున్నారు అంటున్న దర్శకుడు

- Advertisement -

ఈ మధ్యనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో ఒక వివాదాస్పద సినిమా తీసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరొక వివాదాస్పద సినిమా తీయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలో నారా చంద్రబాబు నాయుడు ని విలన్ గా చూపించిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు జగన్ విజయం పై ఒక సినిమా తీయబోతున్నాడు. తాజాగా జరిగిన ఎన్నికలలో వైసిపి పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సాధించిన ఘన విజయం మీద ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమా తెరకెక్కించనున్నాడు.

వైసీపీ మీద సినిమా అంటే అందులో కూడా టిడిపి నాయకులు మరియు చంద్రబాబు నాయుడు ని విలన్లుగా చూపిస్తారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో టిడిపి పార్టీ అభ్యర్థులు రామ్ గోపాల్ వర్మ సినిమా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే తనకు కొన్ని బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నట్లుగా ఆర్జీవి సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. “కొందరు నా ఫోన్ నెంబర్ తెలుసుకొని నాకు బెదిరింపు కాల్స్ మరియు మెసేజెస్ చేస్తున్నారు. అవి నన్ను ఏమాత్రం ప్రభావం ప్రభావితం చేయలేవు. నా లాగా ఓపెన్ గా మాట్లాడలేక వాళ్ళు ఇలాంటివి చేస్తున్నారు” అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఇక విడుదలకు ముందే వివాదాలకు తెర తీసిన ఈ సినిమా విడుదలైన తరువాత ఇంకెన్ని వివాదాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -