Saturday, April 20, 2024
- Advertisement -

గున్న ఎనుగుతో సెల్పీ తీసుకోబోయారు.. తల్లి ఏనుగుకు బలయ్యాడు!

- Advertisement -

ఈ మద్య సెల్పీ మోజులో తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారిని ఎంతో మందిని చూస్తున్నాం. ప్రాణాలు పోతాయని తెలిసి కూడ పిచ్చి సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. తాజాగా ఓ గున్న ఏనుగుతో సెల్ఫీ తీసుకోబోయి దాని తల్లికి ప్రాణాలు బలిఇచ్చాడు ఓ యువకుడు. ఈ నేపథ్యంలో ఓ ఏనుగుల గుంపు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం కేశుపురం, బూర్జపాడు, లక్ష్మీపురం గ్రామ పరిసరాల్లో హడావుడి చేసింది. అక్కడి నుంచి ఆ ఏనుగుల గుంపు ఒడిశా వైపు వెళ్ళింది.

స్థానికంగా ఉన్న బహుదా నదిని దాటి వెళుతుండగా ఆ గుంపులో ఓ చిన్న ఏనుగు దారితప్పి చిక్కుపడిపోయింది. అక్కడ కొంత మంది పిల్లలు యువకులు ఆ గున్న ఏనుగును పట్టుకొని దానితో సెల్ఫీ తీసుకోవడం మొదలు పెట్టారు. అదే సమయానికి తల్లి ఏనుగు రావడంతో అక్కడ ఉన్న పిల్లలు, యువకులు పరుగులంకించుకున్నారు.

ఈ సంఘటన జరుగుతున్న ప్రాంతానికి కొద్దీ దూరంలో ఒక యువకుడు ఈ విషయాన్ని గమనించకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. అంతలోనే ఆ తల్లి ఏనుగు ఓ యువకుడిపై దాడి చేసింది..కాళ్లతో తొక్కి పారేసింది. ఈలోపు అక్కడి స్థానికులు పరుగుల పై వచ్చి ఏనుగును తరిమేశారు. తీవ్రంగా గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ, అప్పటికే ఆయువకుడు ఏనుగు కోపానికి బలైపోయాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -