బాహుబలి చిత్రంలో తెలుగు సినిమాకే ఓ స్టేటస్ తీసుకొచ్చిన దర్శకధీరుడు రాజమౌళి. ఇప్పుడు రాజమౌళి ఏంచేసినా, ఏం మాట్లాడినా పెద్ద విషయమే. అలాంటి రాజమౌళి తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొని అనేక ప్రశ్నలకి ఆసక్తికర సమాధానం చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో బాహుబలి నిర్మాత శోభుతో కలిసి పాల్గొన్న రాజమౌళి.. బాహుబలి సెట్ లో తనని అందరికంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఎవరు అంటే రమ్యకృష్ణ అని చెప్పుకొచ్చారు.
{loadmodule mod_custom,GA1}
తెలుగు టాప్ హీరోలు ఇతర వృత్తులు ఏవి చేస్తే సూపర్ సక్సెస్ అవుతారు అని అడగినప్పుడు… ఆయన ఛాయిస్ ప్రకారం ప్రభాస్ చెఫ్ గా చెబితే.. చరణ్ ను బిజినెస్ మ్యాన్ గా చెప్పారు.ఇందులో భాగంగా తారక్ లో ఒక రాజకీయ నేతను చూస్తున్నట్టుగా రాజమౌళి చెప్పడం ఆసక్తికరంగా ఉంది. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఈ ముగ్గురు హీరోలతోనూ రాజమౌళి సినిమాలు తీశాడు కదా.. మరి వీరు వేరే ప్రొఫెషన్లను స్వీకరిస్తే, ఎవరికి ఏది బాగుంటుందని అనుకుంటున్నారు? అనే ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ.. ప్రభాస్ చెఫ్ గా రాణిస్తాడని చెప్పాడు.
ఇక.. తారక్ కు పాలిటిక్స్ అయితే బాగా సూటవుతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ పేరు వినగానే నిజాయతీ , విశ్వాసం , క్రేజ్ గుర్తుకు వస్తాయని, మహేష్ అనే పేరు వినగానే అందం తప్ప ఇంకేమీ గుర్తు రాదు అని చెప్పుకొచ్చాడు జక్కన్న.
ఎన్టీఆర్ రాజకీయాలకు పనికొస్తాడు సరే.. అవకాశం ఇచ్చేది ఎవరు? అవతల టీడీపీ వారసత్వం విషయంలో లోకేష్ బాబు తో ఎన్టీఆర్ పోటీ పడే పరిస్థితి లేదు. లోకేష్ ను రాజకీయ మేధావిగా నిరూపించడంలో బాబు బిజీగా ఉన్నాడు.
పార్టీ పై వారసత్వ హక్కులనూ కట్టబెట్టేశాడు చంద్రన్న. ఏదో వెనుకటికి అవసరార్థం ఎన్టీఆర్ ను వాడుకుందామని చూశాడు చంద్రబాబు.
{loadmodule mod_custom,GA2}
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}SBYQH5ApxPo{/youtube}