Thursday, May 2, 2024
- Advertisement -

టీడీపీ శవరాజకీయాలు!

- Advertisement -

నిన్న రాజాంలో ప్రచార రథం తగిలి ఓ పదేళ్ల బాలుడికి ప్రమాదం జరిగింది. అయితే యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆ ప్రచార రథం డ్రైవర్ స్వయంగా ఆ బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లినా… దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే రాజాం వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డా. తలే రాజేష్ ఆ బాలుడి కుటుంబాన్ని పరామర్శించి.. అన్ని విధాలుగా వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. కానీ దీన్ని కూడా తెలుగుదేశం రాజకీయం చేయడం సిగ్గుమాలిన చర్య. టీడీపీ కి నిజంగా మంచి చేసే బుద్ధి ఉంటే రాజకీయం చేయకుండా వెళ్లి ఆ బాలుడి కుటుంబానికి భరోసా కల్పించాలే గానీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం నీచాతి నీచం!

అదే రోజు రాత్రి తాడేపల్లిలో మా వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు మేకా వెంకటరెడ్డి గారి మీద టీడీపీ పచ్చ గూండాలు హత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చావుబతుకుల్లో ఉన్నారు. అయినప్పటికీ మీ మంగళగిరి టీడీపీ అభ్యర్ధి ఆయన కుటుంబాన్ని కనీసం పరామర్శించడానికైనా ప్రయత్నించారా? పొరపాటున మేకా వెంకటరెడ్డికి ఏదైనా జరిగితే.. ఆయన కుటుంబం కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడగలరా? వారికి సమాధానం చెప్పగలరా?. వైయస్‌ఆర్‌సీపీ ఎప్పుడూ ఇలాంటి నీచ రాజకీయాలు చెయ్యదు. ఇదీ మీకు మాకు ఉన్న తేడా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -