- Advertisement -

టీటీడీ ఈవో అనిల్ కుమార్‌పై బదిలీ వేటు

- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వ్యవహారాల్లో సంచలనం రేపిన నకిలీ నెయ్యి స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్ జరిగిన సమయంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)గా బాధ్యతలు నిర్వర్తించిన అనిల్ కుమార్ సింఘాల్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేసిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

నకిలీ నెయ్యి సరఫరా వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఈ కేసుపై విస్తృతంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో బాధ్యతలో ఉన్న అధికారుల పాత్రపై కూడా సిట్ దృష్టి సారించింది. స్కామ్ సమయంలో టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ పరిపాలనా బాధ్యతల విషయంలో నిర్లక్ష్యం జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను తక్షణమే విధుల నుంచి వైదొలగాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సింఘాల్ బదిలీ అనంతరం, టీటీడీ కొత్త ఈవోగా రవిచంద్రను నియమించినట్లు ప్రకటించారు. ముఖ్యంగా సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. టీటీడీ పరిపాలనలో పారదర్శకత, భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -