Monday, April 29, 2024
- Advertisement -

మాజీ స్పీకర్ కోడెల ఇంట్లో దొంగతనం….పలు అనుమానాలు

- Advertisement -

అసెంబ్లీ ఫర్నీచర్ మాయం కేసులో మరో సంఘటన చోటు చేసుకుంది. ఫర్నీచర్ ను నేనె తీసుకున్నానని ఒప్పుకున్న మాజీ స్పీకఱ్ కోడెల ఇంట్లో చోరీ జరిగింది. త రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని కోడెల ఇంటికి చేరుకున్నారు. విద్యుత్ మరమ్మతు పనులు చేయాలంటూ లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లోంచి కంప్యూటర్లు పట్టుకుని పరారయ్యారు.

గేట్ వద్ద ఉన్న వాచ్‌మెన్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వాచ్‌మెన్‌పై దాడి చేసి కంప్యూటర్లతో పరారయ్యారు.అసెంబ్లీ భవనం నుంచి విలువైన ఫర్నీచర్‌ని తన ఇంటికి తెచ్చుకున్నట్టు కోడెల శివప్రసాదరావు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చోరీ జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఇవాళ అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు విషయంలో పోలీసులు కోడెల ఇంటికిరానున్న నేపథ్యంలో ఈ దొంగ తనం జరగడం సంచలనం రేపుతోంది.కంప్యూటర్లల్లో నిక్షిప్తమైన కీలక సమాచారాన్ని మాయం చేసేందుకే వీటిని ఎత్తుకెళ్లి ఉంటారన్న ఊహాగానాలు రేగుతున్నాయి. దుండగులు పడేసిన కంప్యూటర్‌ మానిటర్‌ను సెక్యురిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అయితే సమాచారం నిక్షిప్తమైవుండే సీపీలను దుండగులు ఎత్తుకెళ్లడం చూస్తుంటే ఇదంతా ప్రణాళిక ప్రకారమే జరిగినట్టుగా ఉందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -