Tuesday, April 30, 2024
- Advertisement -

పిడుగుపాటుకు 16మంది మృతి…… బాబు అబద్ధాలపై ప్రజల ఆవేదన

- Advertisement -

చంద్రబాబు తీరు అంతే…….ఒక మాట పడేస్తే పోయేదేముంది……పచ్చ మీడియాలో ప్రముఖ హెడ్‌లైన్స్‌తో బాబు అద్భుతం అని ప్రచారం చేస్తంది………గుడ్డిగా నమ్మినవాడు ఓట్లేస్తూ ఉంటాడు. ఇదే చంద్రబాబు రాజకీయ తీరు. ఇప్పుడు అలాంటి బాబు డొల్ల మాటలు మరోసారి నిజమయ్యాయి. బాబు అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రజలకు మరోసారి తెలిసొచ్చింది.

ప్రజలందరూ కూడా మర్చిపోయి ఉంటారులే అని కూడా బాబు అనుకున్నాడు. ఎవరూ పట్టించుకోరు అని కూడా ఆశపడి ఉంటాడు. గుడ్డిగా నమ్మిన జనాలు మాత్రం ఓట్లేస్తారు అనుకుని కొంతకాలం క్రితం ఒక సారి మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా పిడుగులు ఎక్కడ పడతాయో కనుక్కునే టెక్నాలజీని కనిపెట్టామని, రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులోకి వచ్చిందని చెప్పుకొచ్చాడు బాబు. ఇకపై రాష్ట్రంలో పిడుగు పాటుకు గురై ఎవ్వరూ చనిపోరని ప్రగల్భాలు పలికాడు. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పిడుగుల దెబ్బకు 16మంది చనిపోయారని ఈ రోజు టిడిపి భజన మీడియాలోనే ప్రముఖంగా వార్తలు వచ్చాయి. మరి సదరు ప్రపంచ సాంకేతిక నిపుణుడు బాబుగారు కనిపెట్టిన టెక్నాలజీ ఎక్కడ? ఆ టెక్నాలజీ కోసం ఎంత డబ్బులు కేటాయించారో? ఎంత నొక్కేశారో తెలియదు కానీ ప్రజలకు మాత్రం కనీస మాత్రంగా కూడా ఉపయోగపడలేదు అని కంటికి కనిపిస్తున్న నిజాలే చెప్తున్నాయి. అత్యంత ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఆ పిడుగు టెక్నాలిజీ గురించి కనీసం మాట్లాడే ధైర్యం కూడా చంద్రబాబుతో సహా ఆయన కేబినెట్‌లోని మంత్రులు ఎవ్వరూ చేయడం లేదు. అదీ బాబు డప్పాల తీరు. మాటల్లో మాత్రం ఇంద్రలోకాన్ని చూపిస్తాడు……చేతల్లో మాత్రం శూన్య హస్తం దర్శనమిస్తుంది. ఒక్క రోజులోనే ఆంధ్రప్రదేశ్ నాట వివిధ ప్రాంతాల్లో పడిన పిడుగుల దెబ్బకు 16 మంది చనిపోయారన్న వార్త తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిడుగు టెక్నాలజీని కనుక్కున్నా……ఇకపై ఎవరూ పిడుగుపాటుకు చనిపోరు అని చెప్పిన చంద్రబాబు డబ్బా డైలాగులు గుర్తుచేసుకుని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -