- Advertisement -
తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీని ఈ సారి ఖమ్మంలో నిర్వహించనున్నారు. ఈ నెల 27 వతేదిన ఖమ్మంలో పార్టీ ప్లీనరీ జరుగుతుందని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, నాయిని నర్శింహారెడ్డి వెల్లడించారు.
పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈ నెల 26 వ తేదీ సాయంత్రానికే ఖమ్మం వస్తారని, 27 ఉదయం పార్టీ నూతన కార్యాలయానికి శంకుస్ధాపన, అనంతరం పార్టీ ప్లీనరీ ఉంటాయని వారు చెప్పారు.
ఈ ప్లీనరీలో నీళ్లు.. నిధులు.. పథకాలపై చర్చిస్తామని, అనంతరం సాయంత్రం బహిరంగ సభ ఉంటుందని మంత్రులు తెలిపారు. ఈ ప్లీనరీలో పార్టీ అగ్రనేతలతో పాటు వేలాది మంది కార్యకర్తలు కూడా హాజరవుతారని వారు చెప్పారు.