Saturday, May 4, 2024
- Advertisement -

మంకు పట్టు పక్కన పెట్టిన ట్రంప్..!

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మంకు పట్టు వీడారు. కాంగ్రెస్ ఆమోదించిన కరోనా ఉద్దీపన ప్యాకేజీపై ఎట్టకేలకు సంతకం చేశారు. ఆదివారం రాత్రి ఈ విషయాన్ని వెల్లడించారు ట్రంప్. 900 బిలియన్ డాలర్లతో రూపొందించిన భారీ ప్యాకేజీతో.. కొవిడ్ వల్ల నష్టపోయిన వ్యాపారాలు, ప్రజలకు సాయం చేసేందుకు వీలు కలగనుంది.

ప్యాకేజీలో అనవసర అంశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రంప్ తొలుత సంతకం చేసేందుకు నిరాకరించారు. ప్యాకేజీని ఆమోదించకపోవచ్చని చెప్పారు. చివరగా ఈ బిల్లుకు సమ్మతి తెలపడం వల్ల ప్రభుత్వాలకు భారీ నిధులు మంజూరు కానున్నాయి. సెప్టెంబర్ వరకు ప్రభుత్వ ఏజెన్సీలకు 1.4 ట్రిలియన్ డాలర్ల నిధులు అందేలా బిల్లు రూపొందించారు. కుటుంబాలకు, నిరుద్యోగులకు సాయం అందించేలా తయారుచేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -