- Advertisement -
ఉత్తరాఖండ్ లో హరీష్ రావత్ ప్రభుత్వం బల పరీక్ష ముగిసింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం నాడు శాసనసభలో బల నిరూపణ పరీక్ష జరిగింది.
తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ కు అనర్హులని పేర్కొనడంతో వారు ఓటింగ్ లో పాల్గొనలేదు. మిగిలిన ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓట్లను సీల్డ్ కవర్ లో ఉంచి సుప్రీంకోర్టుకు అప్పగించారు.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బుధవారం నాడు ఫలితం వెల్లడి అయ్యే అవకాశం ఉంది. అయితే అనధికారికంగా తెలిసిన సమాచారం మేరకు ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఈ బల పరీక్షలో గెలిచినట్లుగా చెబుతున్నారు.