- Advertisement -
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉచిత వివాహం చేసుకోవాలనుకుంటున్నారా. ఇందుకోసం మీరు తిరుమల వెళ్లనవసరం లేదు. మీ పెళ్లిని ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్ధానం.
ఇంతకు ముందు ఉచిత వివాహాలు చేసుకోవాలనుకునే వారు ముందుగా తిరుమల వెళ్లి పెళ్లి తేదితో పాటు ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు. అయితే వీలైనంత ఎక్కువ మందికి ఈ సేవ అందాలనే ఆలోచనతో ఆన్ లైన్ బుకింగ్ పథకాన్ని ప్రవేశపెడుతోంది టిటిడి.
ఈ నెల 9 వ తేది నుంచి ఇది అమలవుతుందని ఆలయ ఈవో సాంబశివరావు ప్రకటించారు. శ్రీరామానుజాచార్యుల వెయ్యోజయంతిని పురస్కరించుకుని ఈ నెల 10 వ తేదీ నుంచిఏడాది పాటు 106 దివ్యాదేశాలలో హిందూ ధర్మ ప్రచారం చేయాలని టిటిడి నిర్ణయించింది.