3 ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థగా భారత్.. బడ్జెట్ ముఖ్యాంశాలు
Union Budget speech 2019
Budget speech 2019, Finance minister Nirmala Sitharaman
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ఎలా ఉండబోంతోందో నని దేశ ప్రజలు అసక్కికరంగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బారత్ ఈ ఏడాదికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని… త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రైల్వే శాఖలో ఏటా కోట్ల పెట్టుబడుల అవసరం ఉందని తెలిపారు. దేశమంతటా మెరుగైన విద్యుత్ సేవల కోసం ‘ఒకే దేశం-ఒకే గ్రిడ్’ విధానం తీసుకొచ్చామని వెల్లడించారు. దీంతో విద్యుత్ ధరలు తగ్గాయని చెప్పారు. దేశంలో అన్నివర్గాల ప్రజలు మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని సీతారామన్ అన్నారు .
2019-20 బడ్జెట్ హైలెట్స్..
1.విద్యుత్ వాహనాలకు ప్రత్యేక రాయితీలు
2.జల్ వికాస్ మార్గ్’ పథకం ద్వారా అంతర్గత జలరవాణాకు అధిక ప్రాధాన్యత
3 కోట్ల మంది రిటైల్ వర్తకులకు పెన్షన్ కోసం ‘ప్రధాన మంత్రి కరమ్ యోగి మాన్ ధన్ పథకం’
4.ఏటా వార్షికాదాయం రూ.1.5 కోట్లలోపు ఉన్న వ్యాపారులు ఇందుకు అర్హులు
- పథకం కోసం ఆధార్, బ్యాంకు అకౌంట్ ఉంటే చాలు
6.లిస్టెడ్ కంపెనీల్లో ప్రజల వాటా పెంచేందుకు నిర్ణయం
7.ఇందుకోసం సెబీతో చర్చించిన కేంద్రం, కేవైసీ నిబంధనలు సులభతరం చేయాలని సూచన
8.సెబీ పర్యవేక్షణలో సోషల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ ఏర్పాటు
9.సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పెట్టుబడులు(ఈక్విటీ, అప్పు, మ్యూచువల్ ఫండ్) సమీకరించేలా త్వరలో నిబంధనలు
10.2014-19 మధ్య ఆహర భద్రత కోసం రెట్టింపు ఖర్చు.
11.కొన్నేళ్లలోనే భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరనుంది. ఎన్డీయే అకృరంలోకి వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ఈ ఏడాదే 3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనుంది
- గత ఐదేళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. సామాన్యుడి జీవితాలను మార్చేందుకు ప్రయత్నించాం. మేకిన్ ఇండియాకు ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశంలో సంపద సృష్టిస్తున్నాం. కనెక్టివిటీ కోసం ఎన్డీయే సర్కారు తీవ్రంగా శ్రమించింది. భారత్ మాల, సాగర మాలతో మౌలిక వసతులను కల్పించాం.
- దేశవ్యాప్తంగా ఏకీకృత రవాణా వ్యవస్థ కోసం ప్రత్యేక విధానం