Thursday, May 16, 2024
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌లోకి కీలక నేత..

- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌లోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జీ దీపాదాస్ మున్షి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

గుత్తాకు నల్గొండ జిల్లాలో మంచి పట్టు ఉంది. అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అనుచరులు ఉన్నారు. బీఆర్ఎస్‌లోకి రాకముందు జిల్లా రాజకీయాలను శాసించారు గుత్తా. కాంగ్రెస్ తరపున నల్గొండ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరి రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

ఇటీవల బీఆర్ఎస్ పార్టీపై గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దక్షిణా తెలంగాణను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందన్నారు. అంతేగాదు పార్టీలోని లోపాలను సైతం ఎత్తిచూపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -