చిలకలూరిపేటలో టీడీపీ-సేన, బీజేపీ నిర్వహించిన మెగా మీటింగ్ ఫ్లాప్ షోగా మిగిలిపోయింది. మూడు పార్టీల ఉమ్మడి సభ జనం లేక వెలవెలబోయింది. ఇక ప్రధానంగా ఈ మీటింగ్లో లోపాలు కళ్లకు కట్టినట్లు అందరికి కనిపించింది. యాంకర్కు మీటింగ్ పై అవగాహనక లేకపోవడంతో ప్రోగ్రాం షీట్ కూడా సరిగ్గా చదవలేకపోయింది.
సన్మానం కోసం పిలిచినప్పుడు చంద్రబాబు,పవన్ కళ్యాణ్లకు ప్రధాని ఇవ్వడానికి శాలువాలు, పుష్పగుచ్ఛాలు కూడా లేవు. పవన్, బాబు ఇద్దరూ పుష్పగుచ్ఛం కోసం చుట్టూ చూశారు కానీ ఏమీ రాలేదు. మోడీ మాట్లాడుతుంటే మైకులు సరిగా పనిచేయలేదు.
ఇక మీటింగ్లో చంద్రబాబు, పవన్లకు ప్రధాని మోడీ భజనతో సరిపోయింది. ఎంతసేపు మోడీని పొగడానికే ప్రాధాన్యత ఇచ్చారు ఇద్దరు నేతలు. ఇక పవన్ స్పీచ్లో ఏమాత్రం పసలేదు. ఏపీకి కీలకమైన ప్రత్యేక హోదా ఇస్తారా? ఇవ్వరా? అని చెప్పలేదు. ఇక పోలవరం ప్రస్తావనే లేదు?అలాగే స్టీల్ ప్లాంట్ ను ఉంచుతారా? లేక అమ్ముతారా? అన్నది చెప్పలేదు. మొత్తంగా మూడు పార్టీల సభ అట్టర్ ఫ్లాప్ షో అని టాక్ వినిపిస్తోంది.